వృద్ధాప్య పెన్షన్లు రూ.2,500లకు పెంచాలి: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-09-01T13:38:38+05:30 IST

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగానైనా వృద్ధాప్య పెన్షన్లు పెంచి రూ.2,500లుగా అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

వృద్ధాప్య పెన్షన్లు రూ.2,500లకు పెంచాలి: రామకృష్ణ

అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగానైనా వృద్ధాప్య పెన్షన్లు పెంచి రూ.2,500లుగా అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు. గత ఎన్నికలకు ముందు వైసీపీ అధికారంలోకి వస్తే పెన్షన్లు రూ.3 వేలు చేస్తామని హామీ ఇచ్చారని... అధికారంలోకి రాగానే వృద్ధాప్య పెన్షన్‌ను ప్రతీ ఏటా రూ.250 మాత్రమే పెంచుతామనే కండిషన్ పెట్టి, మొదటి సంవత్సరం రూ.2,250 చేశారని విమర్శించారు. జులై నుండి పెంచి ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఈ ఏడాది వృద్ధాప్య పెన్షన్లు పెంచలేదని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-09-01T13:38:38+05:30 IST