తెలంగాణ తరహాలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించండి: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-09-16T14:18:19+05:30 IST

రాష్ట్రంలో తక్షణమే పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకై చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

తెలంగాణ తరహాలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించండి: రామకృష్ణ

అమరావతి: రాష్ట్రంలో తక్షణమే పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకై చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు. ఇళ్ల స్థలాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 43 వేల ఎకరాల భూములను సేకరించారని... అయితే కేవలం 4 వేల ఎకరాల భూములకు సంబంధించి మాత్రమే వివాదాలు తలెత్తాయని అన్నారు. మిగిలిన 39 వేల ఎకరాల భూములను తక్షణమే పంపిణీ చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. పేదలకు ఇళ్ల స్థలాలకై పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున కేటాయించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర తరహాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ టిడ్‌కో ఆధ్వర్యంలో నిర్మించిన 6 లక్షల గృహాలకు ఇప్పటికైనా తుది మెరుగులు దిద్ది లబ్ధిదారులకు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-16T14:18:19+05:30 IST