సాయినార్ బాధితులకు కోటి పరిహారం ఇవ్వాలి: జేవీ సత్యనారాయణ

ABN , First Publish Date - 2020-07-02T16:28:05+05:30 IST

సాయినార్ బాధితులకు కోటి పరిహారం ఇవ్వాలి: జేవీ సత్యనారాయణ

సాయినార్ బాధితులకు కోటి పరిహారం ఇవ్వాలి: జేవీ సత్యనారాయణ

విశాఖపట్నం: విశాఖలో వరుసగా పరిశ్రమలల్లో గ్యాస్ లీకేజ్ ఘటనలు జరుగుతున్నాయని... సాయినార్ పరిశ్రమలో గతంలో కూడా ప్రమాదాలు జరిగాయని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ అన్నారు. హోదా బట్టి వారికి నష్ట పరిహారం ఇవ్వడం సరికాదని విమర్శించారు. ఎల్జీ ప్రమాదంలో కోటి నష్టపరిహారం ఇచ్చారని...సాయినార్ ప్రమాదంలో ఎందుకు బాధితులకు ఎక్కువ నష్ట పరిహారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎల్జీ ఘటనలో బాధితులకు కోటి పరిహారం ఇచ్చిన విధంగానే సాయినార్ భాదితులకు కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 


రసాయన పరిశ్రమలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలన్నారు. ప్రతి ఏడాది ఉత్తరాంధ్రలో ఇలాంటి ప్రమాదాలు తరుచుగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ ప్రమాదాలపై కాలుష్య నియంత్రణ మండలి కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్జీ నిర్వాహకులను ఒక్కరిని కూడా అరెస్ట్ ఎందుకు చేయలేదని  నిలదీశారు. ప్రమాదాలు జరిగినప్పుడు పరిశ్రమలకు వెళ్లిన ప్రతిపక్షాలను ఎందుకు అడ్డుకుంటున్నారని...ఈ వైఖరి సరైంది కాదని జేవీ సత్యనారాయణ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-07-02T16:28:05+05:30 IST