తూ.గో జిల్లాలో ఓ కుటుంబాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన అధికారులు
ABN , First Publish Date - 2020-03-28T23:29:27+05:30 IST
కరోనా అనుమానంతో ఓ కుటుంబాన్ని ఆధికారులు ఆసుపత్రికి తరలించారు. అయినవిల్లి మండలం విలస గ్రామానికి చెందిన ఓ కుటుంబాన్ని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి అధికారులు తరలించారు.
రాజమండ్రి: కరోనా అనుమానంతో ఓ కుటుంబాన్ని ఆధికారులు ఆసుపత్రికి తరలించారు. అయినవిల్లి మండలం విలస గ్రామానికి చెందిన ఓ కుటుంబాన్ని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి అధికారులు తరలించారు. కుటుంబంలోని ఓ వ్యక్తి హైదరాబాద్లోని ఓ హోటల్లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. అదే హోటల్లో లండన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి బస చేశాడు. లండన్కు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో 8 మంది కుటుంబ సభ్యులను అధికారులు ఆస్పత్రికి తరలించారు.