పార్వతీపురంలో వైద్య విద్యార్థినికి కరోనా లక్షణాలు
ABN , First Publish Date - 2020-03-30T19:50:24+05:30 IST
పార్వతీపురంలో ఓ వైద్య విద్యార్థినికి కరోనా లక్షణాలు కనిపించాయి.
విజయనగరం జిల్లా: పార్వతీపురంలో ఓ వైద్య విద్యార్థినికి కరోనా లక్షణాలు కనిపించాయి. ఆమెకు గొంతునొప్పి, జ్వరం రావడంతో అధికారులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆ యువతి ఈ నెల 20న ఫిలిప్పీన్స్ నుంచి పార్వతీపురం వచ్చింది.
కాగా పార్వతీపురంలోని సౌందర్యనగర్లోని ఓ యువకునికి కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో అధికారులు ఆ యువకునికి స్ధానిక ఆసుపత్రిలో ప్రాధమిక పరీక్షలు చేయించారు. అనంతరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఆ యువకుడు ఇటీవల ఢిల్లీలోని ఓ మసీదు దగ్గర ప్రార్ధనలకు హాజరై వచ్చినట్లు అధికారులు గుర్తించారు.