48 గంటల్లో కరోనా ఫలితం!
ABN , First Publish Date - 2020-07-08T08:37:14+05:30 IST
కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న ల్యాబొరేటరీల్లో పేరుకుపోతున్న నమానాలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇకనుంచి కరోనా పరీక్షలను హేతుబద్దంగా

- కలర్ కోటెడ్తో 4 కేటగిరీలుగా విభజన
- ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ
గుంటూరు(మెడికల్), జూలై 7: కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న ల్యాబొరేటరీల్లో పేరుకుపోతున్న నమానాలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇకనుంచి కరోనా పరీక్షలను హేతుబద్దంగా నిర్వహించాలని నిర్ణయించింది. ‘పెండింగ్లో 2 లక్షల కరోనా నమూనాలు’ అనే శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ఈ నెల 2, 3 తేదీల్లో కథనాలు వెలువడిన నేపథ్యంలో.. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమవారం నూతన మార్గదర్శకాలు జారీచేశారు.
ఎక్స్ట్రీమ్లీ ఎమర్జెన్సీ కేటగిరి: దీనికి రెడ్ కల ర్ కేటాయించారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్తోపాటు హై ప్రొఫైల్ వ్యక్తులు, కట్టడి ప్రాంతా లు, ఆస్పత్రుల్లో కోలుకొని డిశ్చార్జి కోసం ఎదురుచూసే రో గులను ఈ కేటగిరీలో చేర్చారు. 12 గంటల్లోపు పరీక్షలు చేసి ఫలితాలు అందిస్తారు.
వెరీ అర్జెంట్ కేటగిరి: దీనికి ఆరెంజ్ కలర్ కేటాయించారు. కరోనా లక్షణాలైన జ్వరం, దగ్గు, జలుబు, ఆయాసంతో బాధపడే రోగులు, ఆరోగ్య సేవ లు అందించే సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, మున్సిపాల్టీ సిబ్బందిని ఈ విభాగంలో చేర్చారు. 24 గంటల్లోపు పరీక్షించి ఫలితాలు ప్రకటిస్తారు.
అర్జెంట్ కేటగిరి: దీనికి బ్లూ కలర్ కేటాయించారు. ఆరోగ్య శాఖ నిర్వహించే సీరో సర్వేలెన్స్, టార్గెట్ టెస్టింగ్ గ్రూప్లు, వృద్ధులు, హై రిస్క్ సమూహాలు, ఆరోగ్యసేతు హెచ్చరించే కేసులను ఈ విభాగంలోకి వస్తాయి. ఈ కేటగిరీ నమూనాలను 36 గంటల్లోపు పరీక్షించి ఫలితాలు అందిస్తారు.
నార్మల్ కేటగిరి: దీనికి గ్రీన్ కలర్ కేటాయించారు. పైన పేర్కొన్న వారు మినహా మిగిలిన వారంతా ఈ గ్రూప్లోకి వస్తారు. ఈ నమూనాలను 48 గంటల్లోపు పరీక్షించి ఫలితాలు ప్రకటిస్తారు.