విశాఖలో ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-04-04T14:00:31+05:30 IST

విశాఖ: విశాఖలో ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని తేలింది. ముంబై నుంచి వచ్చిన యువకుడి ద్వారా అత్త, బావమరిదికి కూడా కరోనా సోకింది.

విశాఖలో ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్

విశాఖ: విశాఖలో ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని తేలింది. ముంబై నుంచి వచ్చిన యువకుడి ద్వారా అత్త, బావమరిదికి కూడా కరోనా సోకింది. దీంతో విశాఖలో నిన్న ఒక్కరోజే కేసుల సంఖ్య 4కు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 15 కేసులు నమోదయ్యాయి. కాగా ఏపీలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 164కు చేరుకుంది. తొలి మరణాన్ని నిన్న అధికారులు వెల్లడించారు. చనిపోయిన 4 రోజులకు తొలి కరనా మరణాన్ని వెల్లడించడం గమనార్హం. 

Updated Date - 2020-04-04T14:00:31+05:30 IST