తండ్రీకొడుకులకు కరోనా పాజిటివ్.. హాస్పిటల్‌కు తరలిస్తుండగా తండ్రి మృతి

ABN , First Publish Date - 2020-07-08T17:22:07+05:30 IST

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం పెర్కిపాలెం గ్రామంలో తండ్రీ కొడుకులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

తండ్రీకొడుకులకు కరోనా పాజిటివ్.. హాస్పిటల్‌కు తరలిస్తుండగా తండ్రి మృతి

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం పెర్కిపాలెం గ్రామంలో తండ్రీ కొడుకులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హాస్పిటల్‌కి తరలిస్తుండగా తండ్రి మృతి చెందాడు. కొడుకుని వైద్య సిబ్బంది ఆసుపత్రికి తరలించింది. నిన్న సాయంత్రం తండ్రికొడుకులకు పాజిటివ్ రిపోర్టు అందించారు. అప్పటి నుంచి అంబులెన్స్ కోసం పలుమార్లు బాధితులు ఫోన్ చేశారు. దాదాపు ఏడుగంటలు ఆలస్యంగా అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ రావడం ఆలస్యం కావడం వలనే తండ్రి చనిపోయాడని బంధువులు పేర్కొంటున్నారు. 

Updated Date - 2020-07-08T17:22:07+05:30 IST