తూర్పుగోదావరి జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు
ABN , First Publish Date - 2020-04-28T18:01:59+05:30 IST
తూర్పుగోదావరి జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. మహిళకు కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే ఆమెకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులో కరోనా పాజిటివ్గా తేలడంతో మహిళను కాకినాడ ఐసోలేషన్కు తరలించారు. ఆమె కుటుంబసభ్యులందరినీ అధికారులు క్వారంటైన్కు తరలించారు. అయితే బాధితురాలికి వైరస్ ఎలా సోకింది...ఎవరి ద్వారా వచ్చిందనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. తాజాగా మరో 82 కొత్త కేసులు నమోదయ్యాయని ఏపీ ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది. ఈ కొత్త కేసులతో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1259కు చేరుకుంది. అలాగే కరోనాను జయించి 258 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది కోవిడ్-19 బారిన పడి మరణించారు. ప్రస్తుతం 970 మంది పలు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.