ఒంగోలు జీజీహెచ్లో కరోనా రోగుల అవస్థలు
ABN , First Publish Date - 2020-09-04T18:37:12+05:30 IST
ఒంగోలులోని జీజీహెచ్లో కరోనా రోగులు అవస్థలు పడుతున్నారు.
ప్రకాశం జిల్లా: ఒంగోలులోని జీజీహెచ్లో కరోనా రోగులు అవస్థలు పడుతున్నారు. కనీస సదుపాయాలు లేవంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని, ఆస్పత్రిలో నిత్యం పవర్ కట్తో ఇక్కట్లు పడుతున్నామన్నారు. అధికారులు సరైన ఆహారం కూడా ఇవ్వడం లేదని కరోనా రోగులు ఆవేదన వ్యక్తం చేశారు.