నెగెటివ్ వచ్చినా...
ABN , First Publish Date - 2020-08-10T09:28:39+05:30 IST
స్వర్ణ ప్యాలె్స కొవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన పొట్లూరి పూర్ణచంద్రరావు(78) మృతిచెందారు. కొన్నిరోజుల క్రితం కరోనా బారిన
మంగళగిరి క్రైమ్, ఆగస్టు 9: స్వర్ణ ప్యాలె్స కొవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన పొట్లూరి పూర్ణచంద్రరావు(78) మృతిచెందారు. కొన్నిరోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన ఈ సెంటర్లో చికిత్స పొందుతున్నారు. శనివారం పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చిందని, ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జి కానున్న తరుణంలో అనుకోని విధంగా జరిగిన ప్రమాదంలో మృతిచెందినట్లు బంధువులు వాపోయారు.