రాష్ట్రంలో మూడో దశలో కరోనా!
ABN , First Publish Date - 2020-04-08T20:15:23+05:30 IST
రాష్ట్రంలో మూడో దశలో కరోనా వ్యాపిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. గుంటూరుకు చెందిన ఒక వ్యక్తికి సోమవారం కరోనా పాజిటివ్గా తేలింది.

అమరావతి: రాష్ట్రంలో మూడో దశలో కరోనా వ్యాపిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. గుంటూరుకు చెందిన ఒక వ్యక్తికి సోమవారం కరోనా పాజిటివ్గా తేలింది. ఆయన విదేశాలకు వెళ్లలేదు. ఆయన కుటుంబ సభ్యులూ విదేశాల నుంచి రాలేదు. ఢిల్లీ కనెక్షనూ లేదు. ఇంకెవరి ద్వారానో ఆయనకు వైరస్ సోకింది. ఈ కేసు హిస్టరీని చేధించేపనిలో అధికారులు పడ్డారు. రాష్ట్రంలో మొత్తం 8 మందికి ఎవరి ద్వారా అన్నది తెలియకుండానే వైరస్ సోకింది. వైరస్ ఎలా సోకిందనే దానిపై అధికారులు దృష్టి సారించారు. కరోనా బాధితుల కాంటాక్ట్ను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైందని, ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలోనే ఉందని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి తెలిపారు. ఏపీలో లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేయడం కుదరదని ఆయన తేల్చిచెప్పారు.