వస్త్ర వ్యాపారం ఢమాల్..
ABN , First Publish Date - 2020-03-18T09:36:16+05:30 IST
కరోనా వైరస్ ప్రచారంతో వస్త్ర వ్యాపారం కోలుకోలేని విధంగా దెబ్బతిందని, వ్యాపారాలు పూర్తిగా తగ్గాయని ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, ప్రధాన కార్యదర్శి బీజేపీ శ్రీనివాస్ చెప్పారు. పెళ్లిళ్ల సీజన్ రావటంతో
![వస్త్ర వ్యాపారం ఢమాల్..](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
గుంటూరు: కరోనా వైరస్ ప్రచారంతో వస్త్ర వ్యాపారం కోలుకోలేని విధంగా దెబ్బతిందని, వ్యాపారాలు పూర్తిగా తగ్గాయని ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, ప్రధాన కార్యదర్శి బీజేపీ శ్రీనివాస్ చెప్పారు. పెళ్లిళ్ల సీజన్ రావటంతో వ్యాపారాలు పుంజుకుంటాయని భావించామని, కానీ కరోనా ప్రచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. స్థానిక ఎన్నికలు ముగిసిన తర్వాత వ్యాపారాలు పుంజుకుంటాయనుకుంటే వాయిదాతో పరిస్థితి మరింత దారుణంగా తయారైందన్నారు.