20 నిమిషాల్లో ఫలితం..!

ABN , First Publish Date - 2020-06-19T09:50:36+05:30 IST

కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం సమస్యగా మారింది. పైగా కరోనా పరీక్షల కిట్లు ..

20 నిమిషాల్లో ఫలితం..!

రూ.600కే కరోనా నిర్ధారణ కిట్‌

తయారీ బృందంలో కడప విద్యార్థిని


రాయచోటి, జూన్‌ 18: కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం సమస్యగా మారింది. పైగా కరోనా పరీక్షల కిట్లు ఖర్చుతో కూడుకున్న పని. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు ఐఐటీ హైదరాబాద్‌ పరిశోధక బృందం రూ.600కే కరోనా నిర్ధారణ పరీక్ష కిట్‌ను అభివృద్ధి చేసింది. దీనితో 20 నిమిషాల్లోనే ఫలితాన్ని తెలుసుకోవచ్చు. ఈ కిట్‌ అభివృద్ధి చేసిన ఇద్దరు సభ్యుల బృందంలో కడప జిల్లా గాలివీడు మండల విద్యార్థిని పట్టా సుప్రజ ఉండడం విశేషం. ఒకేసారి ఎక్కువ మొత్తంలో వీటిని ఉత్పత్తి చేస్తే రూ.350లకే ఈ కిట్‌ను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉన్నట్లు ఆమె తెలిపారు.


క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తయిన ఈ కిట్‌కు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) నుంచి అనుమతి లభించగా.. పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసినట్లు సుప్రజ పేర్కొన్నారు. ఐఐటీలో ఎలక్ర్టికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ శివ్‌గోవింద్‌సింగ్‌ పర్యవేక్షణలో విద్యార్థులు సూర్యస్నాత త్రిపాఠి, పట్టా సుప్రజ ఈ కిట్‌ అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. ప్రస్తుతం కరోనా నిర్ధారణ కోసం ఆర్‌పీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఫలితాల కోసం ఎక్కువ సమయం పడుతోంది. ఖర్చు కూడా ఎక్కువగా ఉంటోంది. అయితే తమ కిట్‌ను సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చని సుప్రజ ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు. 

Updated Date - 2020-06-19T09:50:36+05:30 IST