ఏపీలో కేసులు పెరగడానికి కారణాలేంటి?...
ABN , First Publish Date - 2020-04-26T12:46:01+05:30 IST
ఏపీలో కేసులు పెరగడానికి కారణాలేంటి?...

అమరావతి: ప్రపంచమంతా కరోనా వైరస్కు భయపడుతుంటే ఒక్క రాష్ట్రంలో మాత్రం అక్కడి ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదు అంటూ ప్రతిపక్షాలు గత కొద్దిరోజులుగా విమర్శలు చేస్తున్నారు. ఆ ప్రభుత్వమే ఏపీ సర్కార్. చివరకు ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో వ్యత్యాసం ఉన్నప్పటికీ ఈరోజు పరిస్థితిని చూస్తే పక్క రాష్ట్రం తెలంగాణను మించి ఏపీలో కేసులు నమోదు అవుతున్నాయి. ఇదే అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. దేశ వ్యాప్తంగా 70శాతం వరకు కేసులు రికవరీ అయ్యి మరికొద్దిరోజుల్లో కరోనా నుంచి ప్రజలు భయపడతారని అనుకున్న నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఒకప్పుడు ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్న ఏపీ ఈరోజు దక్షిణాదిలోనే రెండో స్థానంలో చేరుకుంది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తెలంగాణను మించి కేసులు నమోదు అవుతున్నాయి. ఏపీలో కేసులు పెరగడానికి కారణాలేంటి?...ఇదే అంశంపై ఏబీఎన్ మార్నింగ్ ఇష్యూలో చర్చ నిర్వహించారు. ఈ చర్చలో ఏపీ బీజేపీ నేత పూడి తిరుపతిరావు, ఏపీ సీపీఎం నేత రాంభూపాల్, ఏపీ టీడీపీ నుంచి పిల్లి మాణిక్యాలరావు పాల్గొన్నారు. చర్చను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.