రాజమండ్రిలో విజృంభిస్తున్న కరోనా
ABN , First Publish Date - 2020-07-11T02:25:01+05:30 IST
జిల్లాపై కొవిడ్ దాడి కొనసాగుతోంది. ఎక్కడికక్కడ పదుల సంఖ్యలో కేసులు నిర్ధారణ అవుతూనే ఉన్నాయి. రాజమండ్రి నగరంలో పాజిటివ్ల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు

రాజమండ్రి: జిల్లాపై కొవిడ్ దాడి కొనసాగుతోంది. ఎక్కడికక్కడ పదుల సంఖ్యలో కేసులు నిర్ధారణ అవుతూనే ఉన్నాయి. రాజమండ్రి నగరంలో పాజిటివ్ల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు వీటి సంఖ్య పెరిగిపోతూ నగర వాసులను కలవరపెడుతున్నాయి. శుక్రవారం కొత్తగా రాజమండ్రి అర్బన్లో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నగరంలో ఇప్పటివరకు 292 మందికి కరోనా సోకింది. కరోనా రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో 59 కట్టడి ప్రాంతాలుగా అధికారులు ప్రకటించారు. అంతకాకుండా రాజమండ్రి రూరల్లో కూడా ఈ రోజు కొత్తగా 24 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రూరల్లో 202 మంది కరోనా సోకింది. 81 కట్టడి ప్రాంతాలను అధికారుల గుర్తించారు. పెద్ద ఎత్తున విస్తరిస్తున్న వైరస్ మహమ్మారికి కట్టడి ఎప్పుడనేది అంతపట్టక ప్రజలంతా బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు.