‘కరోనా నిధుల నుంచి జర్నలిస్టులకు...’
ABN , First Publish Date - 2020-04-26T23:18:28+05:30 IST
లాక్డౌన్ వేళ జర్నలిస్టుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యుడు మచ్చ రామలింగారెడ్డి అన్నారు.

అనంతపురం: లాక్డౌన్ వేళ జర్నలిస్టుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యుడు మచ్చ రామలింగారెడ్డి అన్నారు. కరోనా ఘటనలపై పోలీసుల కంటే జర్నలిస్టులే వేగంగా పరుగెత్తుతున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టులకు రూ.5వేలు ఆర్థిక సాయం, ఎన్ 95 మాస్కులు, శానిటైజర్లు, పీపీఏ కిట్లు ఇవ్వాలన్నారు. కరోనా నిధుల నుంచి జర్నలిస్టులకు 50 లక్షల బీమా కల్పిస్తూ ప్రత్యేక జీవో ఇవ్వాలని పేర్కొన్నారు.