రాష్ట్రంలోని సమగ్ర ‘రీసర్వే’

ABN , First Publish Date - 2020-11-26T09:17:51+05:30 IST

రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఉన్న భూములు, జనావాసాల రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టేందుకు పురపాలక శాఖ చురుగ్గా సమాయత్తమవుతోంది. వివాదాలు, న్యాయపరమైన సమస్యలకు ఆస్కారమివ్వని విధంగా

రాష్ట్రంలోని సమగ్ర ‘రీసర్వే’

భూములు, జనావాసాల ‘పక్కా రికార్డు’

ఉన్నతాధికారులతో రాష్ట్రస్థాయి కమిటీ 


అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఉన్న భూములు, జనావాసాల రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టేందుకు పురపాలక శాఖ చురుగ్గా సమాయత్తమవుతోంది. వివాదాలు, న్యాయపరమైన సమస్యలకు ఆస్కారమివ్వని విధంగా రికార్డులను పకడ్బందీగా రూపొందించడమే లక్ష్యం గా ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. దాదాపు వందే ళ్ల క్రితం, బ్రిటీష్‌ కాలంలో రాష్ట్రంలో జరిగిన సర్వే ఆధారంగానే స్థిరాస్తుల లావాదేవీలు కొనసాగుతున్నా యి. అయితే, ఈ మధ్యకాలంలో అన్ని ప్రాంతాల్లోనూ పట్టణీకరణ జరగడంతో భూముల ధరలు భారీగా పెరిగాయి. ఫలితంగా ఇప్పటికే లక్షలాది ఎకరాల భూ ములు.. ఇళ్లు, నివాసేతర స్థలాలుగా మారాయి. ఈ నేపథ్యంలో ఆయా స్థలాలు, భూముల వ్యవహారాల్లో అక్రమాలు, వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పరిస్థితులను సరిదిద్దేందుకు పట్టణ భూములు, జనావాసాల రీసర్వే చేపట్టాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్షణ పథకం’లో భాగంగా దీనిని చేపట్టనుంది.


సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ శాఖ సమన్వయంతో నిర్వహించనున్న ఈ రీసర్వేలో వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ సెక్రటరీలతోపాటు పట్టణ సచివాలయాల్లోని ఇతర సెక్రటరీలు కూడా కీలకపాత్ర పోషిస్తారు. ప్రతి ఆస్తికీ ఒక యూనిక్‌ కోడ్‌ నెంబర్‌ను కేటాయిస్తారు. ఆ వివరాలన్నింటినీ నమో దు చేస్తూ రెవెన్యూ రికార్డులను సవరిస్తారు. అర్బన్‌ ల్యాండ్‌ అండ్‌ హ్యాబిటేషన్‌ రీ-సర్వే కార్యక్రమంగా పేర్కొంటున్న దీనిని సమర్ధంగా అమలు చేసేందు కు ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. సీడీఎంఏ చైర్మన్‌గా, డీటీసీపీ మెంబర్‌ కన్వీనర్‌గా(నోడల్‌ ఆఫీసర్‌) వ్యవహరించే దీనిలో  సెటిల్‌మెం ట్లు, రికార్డులు, సీసీఎల్‌ఏలకు చెందిన సీనియర్‌ ఉన్నతాధికారులు ఇద్దరు సభ్యులుగా ఉంటారు.

Updated Date - 2020-11-26T09:17:51+05:30 IST