సమర్ధవంతంగా కరోనాను ఎదుర్కొంటాం: కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా

ABN , First Publish Date - 2020-07-02T17:20:14+05:30 IST

తిరుపతి: జిల్లాలో మొత్తం 1,600 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు.

సమర్ధవంతంగా కరోనాను ఎదుర్కొంటాం: కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా

తిరుపతి: జిల్లాలో మొత్తం 1,600 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు. జిల్లాలో 2,400 హాస్పిటల్ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. వాటికి అదనంగా తిరుపతి పద్మావతి నిలయం శ్రీనివాసాన్ని కోవిడ్ సెంటర్లుగా మార్చామన్నారు. టీటీడీ ఉద్యోగులలో 400 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించామన్నారు. వారిలో విజిలెన్స్ సిబ్బంది, ఒక అర్చకుడు.. మరి కొందరికి పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయన్నారు. తిరుమలకు వచ్చే భక్తులలో ర్యాండమ్‌గా వంద మందికి కోవిడ్ పరిక్షలు నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనలతో సమర్ధవంతంగా కరోనాను ఎదుర్కుంటామని.. లాక్ డౌన్ ఆలోచనే లేదన్నారు.


Updated Date - 2020-07-02T17:20:14+05:30 IST