కోవిడ్ పాజిటివ్ అయినా పరీక్షలు రాయవచ్చు: కలెక్టర్ ముత్యాలరాజు

ABN , First Publish Date - 2020-09-18T21:43:00+05:30 IST

ఏలూరు: జిల్లాలో వీఆర్వో మినహా 18 కేటగిరీలలో సచివాలయ పోస్టులను భర్తీ చేస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా

కోవిడ్ పాజిటివ్ అయినా పరీక్షలు రాయవచ్చు: కలెక్టర్ ముత్యాలరాజు

ఏలూరు: జిల్లాలో వీఆర్వో మినహా 18 కేటగిరీలలో సచివాలయ పోస్టులను భర్తీ చేస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు మాట్లాడారు. సచివాలయ పరీక్షా ఏర్పాట్లపై ముత్యాలరాజు మాట్లాడుతూ.. మొత్తం 1045 పోస్టులకు 74,711 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. 96 ప్రైవేట్, 26 ప్రభుత్వ  భవనాల్లో మొత్తం 122 సెంటర్లలో పరీక్షలకు ఏర్పాట్లు చేశామన్నారు. కోవిడ్ రిపోర్ట్ లేకపోయినా,  కోవిడ్ పాజిటివ్ అయినా పరీక్షలు రాయవచ్చన్నారు. థర్మల్ స్కాన్, మెడికల్ కిట్ల అవసరమైన చోట పీపీఈ కిట్లు సిద్ధం చేశామని ముత్యాలరాజు వెల్లడించారు. 


Updated Date - 2020-09-18T21:43:00+05:30 IST