టీడీపీ సభ్యులను ఎత్తిపడేయండి: సీఎం జగన్
ABN , First Publish Date - 2020-12-01T17:30:47+05:30 IST
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీకి వస్తున్నారో అర్థం కావట్లేదని జగన్మోహన్ రెడ్డి అన్నారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీకి వస్తున్నారో అర్థం కావట్లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రైతుల పరిహారంపై టీడీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. డిసెంబర్ 1న బీమా సొమ్ము ఇస్తామని ముందే చెప్పామన్నారు. అయినా టీడీపీ సభ్యులు సభలో గందరగోళం చేస్తున్నారని, వారిని ఎత్తిపడేయాలన్నారు. డబ్బు ఇస్తున్నామని తెలిసి కూడా ఎందుకు రచ్చ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కావాలనే అసెంబ్లీలో గందరగోళం సృష్టిస్తోందన్నారు. టీడీపీ సభ్యులు ప్రభుత్వం చెప్పే మాటలు వినకుండా ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారన్నారు. డిసెంబర్ 15న రూ.1,227 కోట్ల బీమా చెల్లిస్తున్నామని, డిసెంబర్ 25న ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని సీఎం జగన్ చెప్పారు.