రాజధానితో జగన్ ప్రభుత్వం వికృత జలక్రీడ: పట్టాభి
ABN , First Publish Date - 2020-10-14T23:27:13+05:30 IST
రాజధానితో జగన్ ప్రభుత్వం వికృత జలక్రీడ: పట్టాభి
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై టీడీపీ నేత పట్టాభి రామ్ విమర్శలు గుప్పించారు. క్రిమినల్ అయిన జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతికి వ్యతిరేకంగా చేయాల్సిన కుట్రలన్నీ చేస్తూనే ఉన్నాడని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ముంపులో అమరావతిని తేలేలా చేయడానికి ఆ ప్రాంతంలో భారీగా వరద నీటిని నిల్వ చేశారని పట్టాభి మండిపడ్డారు. కొన్ని గంటల వ్యవధిలోనే ప్రకాశం బ్యారేజీ వద్ద నీరు మూడు రెట్లకు ఎలా పెరిగింది? అని టీడీపీ నేత పట్టాభి ప్రశ్నించారు. కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం మోటార్లు కూడా ఆన్ చేయకుండా జగన్ ప్రభుత్వం రాజధానితో వికృత జలక్రీడ ఆడిందని పట్టాభి విమర్శించారు.