నివర్ తుఫాన్ ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష
ABN , First Publish Date - 2020-11-26T18:03:16+05:30 IST
నివర్ తుఫాన్ ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

అమరావతి: నివర్ తుఫాన్ ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తుఫాన్ తీరాన్ని తాకిందని, బలహీనపడుతుందని సీఎంకు అధికారులు సూచించారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో సగటున 7 సెం.మీ వర్షపాతం నమోదైందని సీఎం జగన్కు రిపోర్ట్ అందించారు. రేణిగుంటలోని మల్లెమడుగు రిజర్వాయర్ సమీపంలో వాగులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.