చిత్తూరు: గ్రామవాలంటీర్పై వైపీపీ మహిళా నేత దాడి
ABN , First Publish Date - 2020-05-24T18:19:51+05:30 IST
చిత్తూరు: గ్రామవాలంటీర్పై వైపీపీ మహిళా నేత దాడి

చిత్తూరు: జిల్లాలోని గంగవరం మండలం రెంతకుంట్ల గ్రామ వలంటీర్పై వైసీపీ మహిళా నేత దాడి చేశారు. సౌమ్య అనే వలంటీర్పై వైసీపీ నాయకురాలు సావిత్రమ్మ అసభ్య పదజాలంతో దూషింస్తూ దాడికి తెగబడ్డారు. వైసీపీ పార్టీ వాళ్లకు మాత్రమే సబ్సీడీ విత్తనాలు, హోసింగ్ లిస్ట్ ఉండాలని, తన ప్రమేయం లేకుండా ఎవరి పేరు లిస్ట్లో చేర్చరాదని సావిత్రమ్మ హుకుం జారీ చేశారు. అయితే తన పరిధిలో లేదని, పై అధికారులతో మాట్లాడుకోవాలని సౌమ్య సూచించింది. దీంతో రెచ్చిపోయిన సావిత్రమ్మ తాను చెప్పింది వినకపోతే ఉద్యోగం ఉండదు అంటూ సౌమ్యపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో గ్రామ వలంటీర్ సౌమ్య తనకు న్యాయం చేయాలంటూ అధికారులు, పోలీసులను ఆశ్రయించారు.