చింతలపూడిలో వలస కూలీల ఆందోళన
ABN , First Publish Date - 2020-05-18T20:41:54+05:30 IST
లాక్డౌన్ కారణంగా చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి, లింగపాలెం మండలాల్లో సుమారు రెండు వందల మంది వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పశ్చిమగోదావరి: లాక్డౌన్ కారణంగా చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి, లింగపాలెం మండలాల్లో సుమారు రెండు వందల మంది వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తమను తమ స్వస్థలాలకు పంపించాలంటూ వలస కూలీలు అంతా కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు స్పందించిన అధికారులు.. వారి వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.