ఓ డిప్యూటీ సీఎం మాట్లాడాల్సిన మాటలేనా?: చినరాజప్ప
ABN , First Publish Date - 2020-10-03T17:04:46+05:30 IST
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్.. బూతులు మాట్లాడటం సంస్కార హీనమని
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్.. బూతులు మాట్లాడటం సంస్కార హీనమని టీడీపీ సీనియర్ నేత చినరాజప్ప విమర్శించారు. ఓ డిప్యూటీ సీఎం మాట్లాడాల్సిన మాటలేనా? అంటూ మండిపడ్డారు. వైసీపీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారన్నారు. జగన్ ప్రభుత్వానికి ఇదే ఆఖరి ఛాన్స్ అని పేర్కొన్నారు. అమరావతిలో పెయిడ్ ఆర్టిస్టులతో ఉద్యమం నడుపుతున్నారంటూ.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన ధర్మాన క్షమాపణలు చెప్పాలని చినరాజప్ప డిమాండ్ చేశారు.