రాష్ట్రంలో అరాచక పాలన: చినరాజప్ప

ABN , First Publish Date - 2020-12-18T00:56:40+05:30 IST

రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. దీనికి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పెద్దాపురం ఎమ్మెల్యే టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు చినరాజప్ప ఆరోపించారు.

రాష్ట్రంలో అరాచక పాలన: చినరాజప్ప

తూర్పుగోదావరి : రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది... దీనికి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పెద్దాపురం ఎమ్మెల్యే  టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప హెచ్చరించారు. జిల్లాలోని తొండంగి మండలం కొత్తపాకాల  గ్రామం వద్ద   గురువారం దివిస్ కర్మాగార నిర్మాణాన్ని నిలిపి వేయాలని రైతులు నిరసన చేస్తున్నారని.. వారి ఆందోళనకు మద్దతిస్తున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల న్యాయమైన కోరికలు ప్రభుత్వం ఆమోదించి శాంతిభద్రతలను కాపాడాలని ఆయన సూచించారు.  అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని చినరాజప్ప డిమాండ్ చేశారు.

Updated Date - 2020-12-18T00:56:40+05:30 IST