పేట ఎమ్మెల్యే రజినీ వర్గీయులపై దాడి
ABN , First Publish Date - 2020-02-22T08:54:16+05:30 IST
గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని మరిది విడదల గోపి, ఎమ్మెల్యే అనుచరులు ఐదుగురిపై గురువారం అర్ధరాత్రి దాడి జరిగింది. కారులో వస్తుండగా కోటప్పకొండ-చిలకలూరిపేట మార్గంలో
చిలకలూరిపేట, ఫిబ్రవరి 21 : గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని మరిది విడదల గోపి, ఎమ్మెల్యే అనుచరులు ఐదుగురిపై గురువారం అర్ధరాత్రి దాడి జరిగింది. కారులో వస్తుండగా కోటప్పకొండ-చిలకలూరిపేట మార్గంలో కట్టుబడివారిపాలెం యుటి జంక్షన్ సమీపంలో ఈ దాడి జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడవల్లి, మద్దిరాల, కమ్మవారిపాలెం గ్రామాలకు చెందిన పదిమందితోపాటు మరికొందరు కలసి తమ కారును అడ్డుకుని దాడిచేసి హత్యాయత్నం జరిపారని, కారును ధ్వంసం చేశారని బాధితులు ఫిర్యాదులో వివరించారు. ఎమ్మెల్యే రజినిని దూషించారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని గుంటూరు రేంజ్ ఐజి వినిత్బ్రిజ్లాల్, జిల్లా రూరల్ ఎస్పీ విజయరావు శుక్రవారం పరిశీలించారు.