నాపై ఈప్రభుత్వానికి ఎంతో కక్ష ఉంది: చంద్రబాబు
ABN , First Publish Date - 2020-02-22T23:34:19+05:30 IST
తనపై, టీడీపీపై ఈప్రభుత్వానికి ఎంతో కక్ష ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వం నిన్న వేసిన సిట్ దానికి మరో ఉదాహరణ అని చెప్పారు. 9 నెలల్లో మూడు సిట్లు, 5 కమిటీలు వేశారని
అమరావతి: తనపై, టీడీపీపై ఈప్రభుత్వానికి ఎంతో కక్ష ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వం నిన్న వేసిన సిట్ దానికి మరో ఉదాహరణ అని చెప్పారు. 9 నెలల్లో మూడు సిట్లు, 5 కమిటీలు వేశారని, 8 నెలల క్రితమే కేబినెట్ సబ్ కమిటీ వేశారన్నారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడటం, పెట్టుబడులు తరిమేయడం తప్ప ఏం సాధించారని ప్రశ్నించారు. జీవో 344 వైసీపీ ప్రభుత్వ వేధింపులకు పరాకాష్ఠ అని మండిపడ్డారు. మీ పాలనపై వచ్చే ప్రభుత్వం సిట్ వేస్తుందని, వీటితో ప్రజలకు ఒరిగేది ఏంటని నిలదీశారు. టీడీపీ ఏనాడూ తప్పు చేయలేదని, వైసీపీ బెదిరింపులకు భయపడమని చంద్రబాబు స్పష్టం చేశారు.