మోదీని ప్రశంసిస్తూ చంద్రబాబు లేఖ
ABN , First Publish Date - 2020-03-27T14:39:20+05:30 IST
అమరావతి: ప్రధాని మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ప్రత్యేక ప్యాకేజి ప్రకటించిన కేంద్రానికి అభినందనలు తెలిపారు.
అమరావతి: ప్రధాని మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ప్రత్యేక ప్యాకేజి ప్రకటించిన కేంద్రానికి అభినందనలు తెలిపారు. సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల రంగాన్ని ఆదుకోవాలని కోరారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగం దెబ్బతినకుండా చూడాలన్నారు. ప్రజానీకం ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయారని.. రైతులకు ఖరీఫ్లో ఇవ్వాల్సిన నగదు కూడా ముందే ఇవ్వడం అభినందనీయమని చంద్రబాబు కొనియాడారు.