చంద్రబాబుపై వైసీపీ మంత్రి కామెంట్స్..
ABN , First Publish Date - 2020-04-10T00:17:03+05:30 IST
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శలు గుప్పించారు.
అమరావతి: ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శలు గుప్పించారు. ప్రజలంతా కరోనాపై పోరాటం చేస్తుంటే చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారని ఆదిమూలపు సురేష్ విమర్శించారు. ప్రపంచానికి కోవిడ్ వైరస్ సోకితే చంద్రబాబుకి రాజకీయ వైరస్ సోకిందని సురేష్ మండిపడ్డారు. డాక్టర్ల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని, ఎన్-95, పీపీఈలు ఏపీలో సరిపడినంత ఉన్నాయని ఆదిమూలపు సురేష్ తెలిపారు. డాక్టర్ సుధాకర్ను అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై బురదజల్లాలని చంద్రబాబు చూస్తున్నారని మంత్రి సురేష్ అన్నారు. లాక్డౌన్ ముగిశాక పరీక్షల తేదీలను నిర్ణయిస్తామని మంత్రి సురేష్ స్పష్టం చేశారు.