పరిహారం ఇవ్వకుండా వెళ్లమంటే ఎలా? : చంద్రబాబు

ABN , First Publish Date - 2020-09-06T16:53:42+05:30 IST

గండికోట ముంపు బాధితుల ఆందోళనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన చంద్రబాబు.. ‘ప్రభుత్వానికి ముందు చూపు, వ్యూహాత్మక కార్యాచరణ

పరిహారం ఇవ్వకుండా వెళ్లమంటే ఎలా? : చంద్రబాబు

అమరావతి: గండికోట ముంపు బాధితుల ఆందోళనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన చంద్రబాబు.. ‘ప్రభుత్వానికి ముందు చూపు, వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక ఉండి సకాలంలో వాటిని అమలు చేస్తేనే ప్రజా ప్రయోజనాలు నెరవేరుతాయి. అవే గనుక లోపిస్తే జరిగే దుష్పరిణామాలకు కడప జిల్లా గండికోట ముంపు బాధితుల కష్టాలే నిదర్శనం’ అని పేర్కొన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ఓటీఎస్ ప్యాకేజీ ఇవ్వకుండానే తాళ్లపొద్దుటూరు గ్రామస్తులను ఖాళీ చేయమంటే అక్కడ నివసించే 1500 కుటుంబాలు ఎక్కడికి వెళ్లాలని ఆయన ప్రశ్నించారు. ఎవరి పంచన తలదాచుకోవాలన్నారు. కేవలం 500 మందికే చెక్కులిచ్చి.. మిగిలిన 2,369 మందికి ఇవ్వకుండా వేధించడం ఏంటని నిలదీశారు. అటు వరదలకు వచ్చిన 26 టీఎంసీల నీళ్లు గండికోట రిజర్వాయర్లో పెట్టుకునే అవకాశం లేకుండా చేశారని, ఇటు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్, ఓటీఎస్ ప్యాకేజీలు ఇ్వవకుండా వేధిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి, ఉదాసీనతకు ప్రజలు మూల్యం చెల్లించాల్సి రావడం బాధాకరం అని పేర్కొన్నారు.

Updated Date - 2020-09-06T16:53:42+05:30 IST