కాసేపట్లో గవర్నర్తో చంద్రబాబు భేటీ
ABN , First Publish Date - 2020-06-18T23:12:12+05:30 IST
సాయంత్రం 6 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను ప్రతిపక్ష నేత చంద్రబాబు కలవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గవర్నర్కు చంద్రబాబు వివరిస్తారు.

అమరావతి: సాయంత్రం 6 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను ప్రతిపక్ష నేత చంద్రబాబు కలవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గవర్నర్కు చంద్రబాబు వివరిస్తారు. అంతేకాకుండా అక్రమ అరెస్ట్లు దాడులపై.. బుధవారం శాసనమండలిలో జరిగిన పరిణామాలను గవర్నర్కు చంద్రబాబు వివరిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.