ప్రత్యక్ష కార్యరంగంలోకి చంద్రబాబు

ABN , First Publish Date - 2020-09-01T17:16:47+05:30 IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మళ్లీ ప్రత్యక్ష కార్యరంగంలోకి దిగుతున్నారు.

ప్రత్యక్ష కార్యరంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మళ్లీ ప్రత్యక్ష కార్యరంగంలోకి దిగుతున్నారు. కరోనా కారణంగా ఇప్పటి వరకు వర్చ్యువల్ సమావేశాల ద్వారానే ప్రజా సమస్యలపైన పార్టీ నేతలతోనూ సమాయత్తం చేసిన చంద్రబాబు 50 రోజుల తర్వాత బుధవారం విజయవాడకు వెళుతున్నారు.


కరోనా కారణంగా అమరావతి ఉద్యమం 200 రోజుకు చేరుకున్న సందర్భంగా చంద్రబాబు పార్టీ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ఆ తర్వాత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు సమయంలో కూడా  ఆయన విజయవాడలోనే ఉన్నారు.  ఆ తర్వాత చంద్రబాబు హైదరాబాద్‌కు వెళ్లి మళ్లీ అమరావతికి రాలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి మంగళవారం పార్టీ సీనియర్ నేతలతో, నియోజవర్గ ఇన్చార్జులు, ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరిపారు. హైదరాబాద్ నుంచి మీడియా సమావేశాలు కూడా నిర్వహించారు. 

Updated Date - 2020-09-01T17:16:47+05:30 IST