జగన్‌కు రాత్రుళ్లు నిద్రలేని పరిస్థితి వస్తుంది: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-02-22T21:07:31+05:30 IST

అమరావతి: సీఎం జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చేసుకోవచ్చునని..

జగన్‌కు రాత్రుళ్లు నిద్రలేని పరిస్థితి వస్తుంది: చంద్రబాబు

అమరావతి: సీఎం జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చేసుకోవచ్చునని, దిక్కున్నచోట చెప్పుకోమన్నానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జగన్ ఏర్పాటు చేసిన సిట్‌పై స్పందించిన ఆయన మాట్లాడుతూ జగన్ మాదిరిగా తాను ఏ తప్పు చేయలేదని అన్నారు. బెదిరింపులకు ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరని, గత ఏడు నెలలుగా ఇదే మాట చెబుతున్నారని మండిపడ్డారు. జగన్ తప్పులు చేసి ఇరుక్కుపోయారని, రాత్రులు నిద్ర లేని పరిస్థితి వస్తుందని, జగన్ వల్ల ఏమీ కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 


చంద్రబాబు ఐదేళ్ల ప్రభుత్వ పాలనపై ఇంటిలిజెన్స్ డీఐజీ నేతృత్వంలో జగన్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. డీఐజీ నేతృత్వం వహించే సిట్‌లో సభ్యులంతా పోలీస్ అధికారులే.. టీడీపీ ఐదేళ్లపాలనపై టోకున దర్యాప్తు చేయాలని ఆదేశించింది. అన్ని కీలక నిర్ణయాలపై సిట్ విచారణ జరపనుంది.

Updated Date - 2020-02-22T21:07:31+05:30 IST