కరోనా కట్టడిపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-06-16T23:56:48+05:30 IST

కరోనా కట్టడి విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహించిందని...

కరోనా కట్టడిపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది: చంద్రబాబు

గుంటూరు: కరోనా కట్టడి విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, అందువల్లే కేసులు అమాంతం పెరిగిపోయాయని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కరోనాపై తొలినాళ్లలోనే బాధ్యతగా వ్యహరించినట్లైతే ఇంత ఉధృతి ఉండేదికాదని ఆయన వ్యాఖ్యానించారు. బ్లీచింగ్ పౌడర్, పారాసిటమాల్ అంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని మండిపడ్డారు. కరోనా కట్టడికి ప్రతిపక్షం చేసిన సూచనలను ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. కరోనా నివారణ కోసం అసెంబ్లీలో కూడా ప్రభుత్వానికి సూచనలను చేశామని చంద్రబాబు తెలిపారు. 

Updated Date - 2020-06-16T23:56:48+05:30 IST