వై.టి.రాజా మృతికి చంద్రబాబు సంతాపం
ABN , First Publish Date - 2020-11-15T15:34:54+05:30 IST
వై.టి. రాజా అకాల మరణం పట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.

విజయవాడ: తణుకు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వై.టి. రాజా అకాల మరణం పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. తణుకు ప్రాంత అభివృద్ధికి రాజా పరితపించేవారని, శాసన సభ్యుడిగా ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. రాజా మృతి పశ్చిమగోదావరి జిల్లాకు, పార్టీకి తీరని లోటని అన్నారు. రాజా కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే వై.టీ. రాజా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఇటీవలే ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. రాజా మృతితో కుటుంబ సభ్యులు, అనుచరులు కన్నీరుమున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న పలువురు కార్యకర్తలు, జిల్లాకు చెందిన నేతలు హైదరాబాద్కు పయనమయ్యారు.