కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వర్చువల్ ర్యాలీ వాయిదా

ABN , First Publish Date - 2020-06-18T16:49:37+05:30 IST

కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వర్చువల్ ర్యాలీ వాయిదా

కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వర్చువల్ ర్యాలీ వాయిదా

అమరావతి: బీజేపీ ఆధ్వర్యంలో జరగాల్సిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వర్చువల్ ర్యాలీ సభ వాయిదా పడింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్‌రెడ్డి మీడియాకు ప్రకటన విడుదల చేశారు. భారత సరిహద్దు ప్రాంతంలో ఏర్పడ్డ చొరబాటులు, దాడులు వంటి వాటిపై ముఖ్య సమావేశాల నేపధ్యంలో వ్యక్తిగత హాజరు నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రెండవ వర్చువల్ ర్యాలీ సభ తేదీని త్వరలో ప్రకటిస్తామని విష్ణువర్ధన్‌రెడ్డి వెల్లడించారు. 

Updated Date - 2020-06-18T16:49:37+05:30 IST