ఆర్థిక ఇబ్బందులున్నా.. రాజీపడొద్దు
ABN , First Publish Date - 2020-04-26T09:53:57+05:30 IST
దేశవ్యాప్త లాక్డౌన్తో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కరోనా నియంత్రణ చర్యల అమలులో రాజీపడొద్దని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం చేసింది. ఈవిషయమై

రాష్ట్రాలకు కేంద్రం సూచన
అమరావతి, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్త లాక్డౌన్తో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కరోనా నియంత్రణ చర్యల అమలులో రాజీపడొద్దని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం చేసింది. ఈవిషయమై శనివారం కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్గౌబ ఢిల్లీ నుంచి రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్డౌన్ తో కరోనా నివారణలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయని, మే 3 వరకు ఇలాగే కొనసాగించాలన్నారు. లాక్డౌన్ వల్ల ఎదురయ్యే సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఈ నెల 20న లాక్డౌన్ నుంచి కొన్ని మినహాయింపులు ఇచ్చామని తెలిపారు. లాక్డౌన్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వంపై నమ్మకంతో ఉన్నారని వీడియోకాన్ఫరెన్స్లో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అన్నారు.