రమేశ్ ఆస్పత్రికి జారీచేసిన నోటీసు రద్దు
ABN , First Publish Date - 2020-09-03T08:37:37+05:30 IST
విజయవాడలోని స్వర్ణప్యాలెస్ ఘటన నేపథ్యంలో రమేశ్ ఆస్పత్రి గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో సమాధానం ఇవ్వాలంటూ

అమరావతి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): విజయవాడలోని స్వర్ణప్యాలెస్ ఘటన నేపథ్యంలో రమేశ్ ఆస్పత్రి గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో సమాధానం ఇవ్వాలంటూ కృష్ణాజిల్లా వైద్యాధికారి జారీ చేసిన నోటీసును హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.