విశాఖపై ప్రేమ కురిపించడం ఆశ్చర్యంగా ఉంది: బుద్దా వెంకన్న
ABN , First Publish Date - 2020-08-16T21:48:09+05:30 IST
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. విజయమ్మను ఓడించారు కాబట్టే హుద్ హుద్ తుపాను వచ్చిందంటూ నాడు విశాఖ వాసులపై విషం కక్కిన విజయసాయి..

విజయవాడ: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. విజయమ్మను ఓడించారు కాబట్టే హుద్ హుద్ తుపాను వచ్చిందంటూ నాడు విశాఖ వాసులపై విషం కక్కిన విజయసాయి.. ఇప్పుడు అదే విశాఖపై ప్రేమ కురిపించడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. ‘మీ ప్రేమ విశాఖ భూములపై మాత్రమే అని అక్కడి ప్రజలకు క్లారిటీ వచ్చింది. విశాఖని మీ రియల్ దందాకి అడ్డాగా మార్చుకొని అడ్డంగా దొరికిపోయిన తరువాత తూచ్ నాకు ఏ సంబంధం లేదు అని అన్నంత మాత్రానా వందేకరాల బంధం పోతుందా?.’ అంటూ విజయసాయిపై బుద్దా వెంకన్న ఆరోపణలు గుప్పించారు.