అది మీ తింగరి మాలోకం జగన్ రేంజ్: బుద్దా వెంకన్న

ABN , First Publish Date - 2020-06-18T15:55:31+05:30 IST

అమరావతి: ఓ కార్యకర్త కోసం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎంత దూరమైనా వెళ్లడాన్ని చూసి వణుకుతున్నారేంటంటూ

అది మీ తింగరి మాలోకం జగన్ రేంజ్: బుద్దా వెంకన్న

అమరావతి: ఓ కార్యకర్త కోసం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎంత దూరమైనా వెళ్లడాన్ని చూసి వణుకుతున్నారేంటంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు. అవినీతి సొమ్ము కోసం తండ్రి శవాన్ని తాకట్టు పెట్టి జగన్ సీఎం అవ్వాలనుకున్నారని విమర్శించారు.


‘‘లోకేష్ కార్యకర్త కోసం ఎంత దూరం అయినా వెళ్లడం చూసి వణుకుతున్నావ్ ఏంటి విజయసాయిరెడ్డి గారు.తాడిపత్రిలో లోకేష్ తనపాటు తెచ్చుకున్న క్యారెజ్ అది కూడా డైటింగ్ లో భాగమైన ఆకుకూరల భోజనం తిన్నారు. దీనిని కూడా రాజకీయం చెయ్యాలి అని చూస్తున్నారు చూడు అది మీ తింగరి మాలోకం జగన్ రేంజ్.


మీ తింగరి మాలోకం అవినీతి సొమ్ము బొక్కడానికి తండ్రి శవాన్ని తాకట్టు పెట్టి సీఎం అవ్వాలి అనుకున్నాడు. ఓదార్పు అంటూ సోకాలు పెట్టాడు, పాదయాత్ర అంటూ మైన్స్, ల్యాండ్స్ పై కన్నేశాడు. అవినీతి సొమ్ము మేసి జైలుకైనా పోవడానికి సిద్ధం అనేది గన్నేరుపప్పే’’ అని బుద్దా వెంకన్న ట్వీట్‌లో పేర్కొన్నారు. 


Updated Date - 2020-06-18T15:55:31+05:30 IST