‘వైసీపీ నేతలైతే పోలీసులను తన్నోచ్చు, బూతులు తిట్టొచ్చు’

ABN , First Publish Date - 2020-12-19T19:05:21+05:30 IST

ఏపీ పోలీసులపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసులను వైసీపీ నేతలు ఇష్టానుసారం దూషిస్తున్నా పట్టించుకోవడం లేదని,

‘వైసీపీ నేతలైతే పోలీసులను తన్నోచ్చు, బూతులు తిట్టొచ్చు’

ఇంటర్నెట్ డెస్క్: ఏపీ పోలీసులపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసులను వైసీపీ నేతలు ఇష్టానుసారం దూషిస్తున్నా పట్టించుకోవడం లేదని, టీడీపీ నేతలపై మాత్రం వెంటనే స్పందిస్తారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పోలీసులను ఉద్దేశించి ట్వీట్ చేసిన ఆయన..  ‘‘గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి బొంగులో పోలీసులు అంటున్నారు. ఆమంచి కొజ్జా పోలీసులు అని దారుణంగా మాట్లాడారు. పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్పందించదా? దీనికి ఫ్యాక్ట్ చెక్ ఉండదా? ప్రతిపక్ష నాయకుల ట్వీట్లకి వాస్తవాలు తెలుసుకోకుండా స్పందించే ఏపీ పోలీస్ ట్విట్టర్ అకౌంట్స్... వైసీపీ నాయకులు నోటి దూలని చూసి కూడా స్పందించవా? లేదా అధికార పార్టీ నాయకులైతే పోలీసులను తన్నోచ్చు, బూతులు తిట్టొచ్చు అని జగన్ రెడ్డి గారు కొత్త చట్టం తెచ్చారా?’’ అని ప్రశ్నించారు.  



Updated Date - 2020-12-19T19:05:21+05:30 IST