ఆ బకాయిలను చెల్లించాలి: బొప్పరాజు
ABN , First Publish Date - 2020-07-10T20:22:23+05:30 IST
ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన రెండు నెలల 50శాతం జీతాల బకాయిలను ప్రభుత్వం ఈ నెలలో చెల్లించాలని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు బొప్పరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అమారవతి: ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన రెండు నెలల 50శాతం జీతాల బకాయిలను ప్రభుత్వం ఈ నెలలో చెల్లించాలని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు బొప్పరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేతన సవరణ జరగక, సకాలంలో డీఏలు అమలు కాక ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ మేరకు సీఎం ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ను కలిసిను బొప్పరాజు.. ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు.