ఏపీలో కాంగ్రెస్‌, టీడీపీ కనుమరుగవుతాయి: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2020-12-05T19:13:02+05:30 IST

టీడీపీ హయాంలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు

ఏపీలో కాంగ్రెస్‌, టీడీపీ కనుమరుగవుతాయి: సోము వీర్రాజు

ఏలూరు: టీడీపీ హయాంలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘దేశంలో బీజేపీ మినహా అన్ని పార్టీల్లో కుటుంబ పాలన ఉంది. మోదీ వచ్చాక అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్‌ ఇచ్చారు. ఏపీలో జనసేన- బీజేపీ పొత్తుతో అధికారంలోకి వస్తాం. ఏపీలో 7,200 కోట్లు తీసుకుని చంద్రబాబు.. 4 తాత్కాలిక బిల్డింగులు కట్టారు. ఏపీలో కాంగ్రెస్‌, టీడీపీ కనుమరుగవుతాయి. జనసేన- బీజేపీ, వైసీపీ మధ్యే పోటీ’ అని సోము వీర్రాజు చెప్పారు.

Updated Date - 2020-12-05T19:13:02+05:30 IST