మాణిక్యాలరావు మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి
ABN , First Publish Date - 2020-08-01T22:25:03+05:30 IST
మాజీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
![మాణిక్యాలరావు మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి](https://media.andhrajyothy.com/appimg/galleries/2020080104513970/08012020165401n4.jpg)
అమరావతి: మాజీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా నిజాయితీతో కూడిన సేవలందించారని గుర్తుచేసుకున్నారు. మాణిక్యాలరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.