భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనాతో మృతి
ABN , First Publish Date - 2020-08-04T12:59:09+05:30 IST
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (59) కరోనాతో మృతి చెందారు.
రాజమండ్రి: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (59) కరోనాతో మృతి చెందారు. కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్యకు కుటుంబసభ్యులు నిన్న కరోనా పరీక్ష చేయించారు. కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఆయనను భద్రాచలం నుంచి విజయవాడకు తరలిస్తుండగా మృతిచెందారు. స్వగ్రామం వీఆర్పురం మండలం సున్నం వారి గూడెంలో విషాదం నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భద్రాచలం నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు రాజయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు.