మినీ ట్రక్కులకు లబ్ధిదారుల వాటా 10 శాతమే!
ABN , First Publish Date - 2020-12-11T07:16:42+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసేందుకు ఎస్సీ యువతకు మంజూరు చేస్తున్న మినీ ట్రక్కులకు
![మినీ ట్రక్కులకు లబ్ధిదారుల వాటా 10 శాతమే!](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అమరావతి, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసేందుకు ఎస్సీ యువతకు మంజూరు చేస్తున్న మినీ ట్రక్కులకు సంబంధించి లబ్ధిదారుల వాటా కేవలం 10 శాతం మాత్రమేనని సాంఘిక సంక్షేమశాఖ స్పష్టతనిచ్చింది. ఎస్సీ కార్పొరేషన్ మంజూరు చేసే ఒక్కో యూనిట్ మొత్తం విలువలో లబ్ధిదారులు కేవలం 10 శాతం వాటా చెల్లిస్తే మిగతా 90 శాతం మొత్తం కార్పొరేషన్, బ్యాంకులు ద్వారా అందిస్తాయని తాజా ఉత్తర్వులో పేర్కొన్నారు.