రివర్స్తో అనుచరులకు కాంట్రాక్టులు
ABN , First Publish Date - 2020-06-05T10:01:41+05:30 IST
‘‘తండ్రి ధనయజ్ఞాన్ని వారసత్వంగా భావించిన జగన్ ఏడాదిలో రివర్స్ టెండరింగ్ పేరుతో తన అనుచరులకు కాంట్రాక్టులు కట్టబెట్టారు. అంతేతప్ప ఒక్క ప్రాజెక్టులో బొచ్చెడు కాంక్రీట్ వేయలేదు. పోలవరం ప్రాజెక్టును
- అప్రూవర్గా మారిపోండి...
- విజయసాయిరెడ్డికి బుద్దా సూచన
విజయవాడ, మే 4 (ఆంధ్రజ్యోతి): ‘‘తండ్రి ధనయజ్ఞాన్ని వారసత్వంగా భావించిన జగన్ ఏడాదిలో రివర్స్ టెండరింగ్ పేరుతో తన అనుచరులకు కాంట్రాక్టులు కట్టబెట్టారు. అంతేతప్ప ఒక్క ప్రాజెక్టులో బొచ్చెడు కాంక్రీట్ వేయలేదు. పోలవరం ప్రాజెక్టును నిలిపివేసి రాష్ట్ర జీవనాడిపై కొట్ట్డారు’’ అని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. గురువారం ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘పాదయాత్రలో ధరలు తగ్గించుకుంటూ పోతామన్న జగన్ ఇప్పుడు పెంచుకుంటూ పోతున్నారు. సర్వేలో జగన్ టాప్ అని విజయసాయిరెడ్డి అంటుంటే.. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సీఎంగా జగన్ ఫెయిల్ అంటున్నారు. సర్వే తప్పని ఒప్పుకుంటారా? లేక తిరగబడుతున్న ఎమ్మెల్యేలు, ఎంపీలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? తేల్చుకోండి సాయిరెడ్డి గారూ!’’ అంటూ ట్వీట్ చేశారు. ‘‘కారు డోరు తీసి దింపినప్పుడే సీను కాలిపోయిందని తేలిపోయింది. ఢిల్లీకి జగన్ వెళ్లాలనుకున్నప్పుడు తమరు గల్లీలో కనిపించినప్పుడే పక్కనబెట్టారని స్పష్టమైంది. వైసీపీ కేంద్రకార్యాలయంలో అన్నీ తానై సజ్జల చక్కబెడుతున్నప్పుడే నిన్ను సైడ్ చేశారని అర్థమైపోయింది. బాబాయ్లాగా బాత్రూమ్కెళ్లే కంటే.. మారుమనసు పొంది అప్రూవర్గా మారిపోండి విజయసాయిరెడ్డిగారూ! చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తమవుతుంది’’ అని సెటైర్లు వేస్తూ బుద్దా మరో ట్వీట్ చేశారు.