పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బాలసుబ్రమణ్యం రెడ్డి
ABN , First Publish Date - 2020-04-12T07:07:25+05:30 IST
పరిశ్రమలు, వాణిజ్య శాఖలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా ఎస్.బాలసుబ్రమణ్యం రెడ్డిని నియమించారు. పెట్టుబడులు, ఉక్కు శాఖల వ్యవహారాలను ఈయన చూస్తారని...

అమరావతి, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): పరిశ్రమలు, వాణిజ్య శాఖలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా ఎస్.బాలసుబ్రమణ్యం రెడ్డిని నియమించారు. పెట్టుబడులు, ఉక్కు శాఖల వ్యవహారాలను ఈయన చూస్తారని పేర్కొన్నారు. ఐటీఎస్ అధికారిగా ఆయన అడిషనల్ డైరక్టర్ జనరల్ ఫారిన్ ట్రేడ్ విభాగంలో పనిచేశారు. డిప్యూటేషన్పై వచ్చిన ఆయనను పరిశ్రమలశాఖలో నియమిస్తూ శనివారం ఉత్తర్వులిచ్చారు.